Saturday, May 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వేడుక.. శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి

పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వేడుక.. శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో వెలసిన సాయిబాబా ఆలయంలో జూన్ 5వ తేదీ గురువారం త్రిపుర సుందరీ సమేత చంద్రమౌలేశ్వర విగ్రహ ప్రతిష్ట, షిరిడి సాయిబాబా కు మహా కుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ నిర్వాహకులు తెలిపారు. జూన్ మూడవ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు మూడు రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రాణ ప్రతిష్టకు, ఆలయ నిర్మాణానికి మా కమిటీతో పాటు, పలువురు దాతలు విరాళాలు ఇచ్చి సహకరించినందుకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ట జరిగి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాయిబాబా వారికి మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమ వేడుకలను విజయవంతం చేయాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు