Saturday, May 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుక.. ఆలయ కమిటీ

అప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుక.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అప్ప స్వామి నగర్ సంగమేశ్వరం రోడ్డు ధర్మవరం నందు వెలసిన అప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా అర్చకులు యంత్ర ప్రతిష్టాపన, బింబ ప్రతిష్ట హోమాలు, కామధేను, దర్పణ దర్శనం మహా కుంభాభిషేకం తదితర కార్యక్రమాలను వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకలకు విజయవంతం చేసిన వారందరికీ కూడా పేరుపేరునా ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల అప్ప స్వామి గురు పరంపర మందిర దేవస్థానం ఆలయ కమిటీ, భక్తాదులు, అప్ప స్వామి నగర్ ప్రజలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు