విశాలాంధ్ర ధర్మవరం:: మెగా డీఎస్సీ పరీక్షలకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షల అర్హత సాధించిన ధర్మవరం వాసులకు ఆన్లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెనుకబడిన తరగతుల సంక్షేమ ధర్మవరం అధికారి డి. వెంకటేశ్వర్లు, వార్డెన్లు జ్యోతి,విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ, ఈ బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల నుండి, మెగా డీఎస్సీ ఆన్లైన్ ఉచిత శిక్షణ కొరకు టెట్ పరీక్షల్లో అర్హత సాధించిన మార్కుల పత్రము, నేటివిటీ పత్రము, కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రము, ఆధార్ కార్డ్, రెండు పాస్పోర్ట్ సైజ్ లో ఫోటోలను జతపరిచి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఈనెల 15వ తేదీ తుది గడువు అవుతుందని తెలిపారు. దరఖాస్తు పత్రాలను కార్యాలయము నుండి పొందవచ్చునని మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయంలో గాని ఫోన్ నెంబర్ 9 4 9 1 9 8 2 0 2 1 ద్వారా గాని సంప్రదించవచ్చునని తెలిపారు.
మెగా డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. డి వెంకటేశ్వర్లు
RELATED ARTICLES