Thursday, April 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ధర్మవరం వారి సేవలు

పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ధర్మవరం వారి సేవలు

విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో బాబా 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం పట్టణంలోని గాంధీ నగర్ వారి శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ప్రశాంతి రైల్వే స్టేషన్ పుట్టపర్తి వెళ్లే వెయ్యి మంది భక్తాదులకు మధ్యాహ్నం భోజన ఏర్పాటును నిర్వహించడం జరిగిందని కన్వీనర్ నామప్రసాద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 21 న, 22న, 23న (మూడు రోజులపాటు) భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది సేవా కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తాదులు శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు