విశాలాంధ్ర ధర్మవరం; హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 6 వ తేదీ నుండి 8వ తేదీ వరకు భీమవరంలో జరగనున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలలో పాల్గొనే హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జట్టును హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్,సత్యసాయి జిల్లా సెక్రెటరీ బంధనాథం సూర్య ప్రకాష్,హాకీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు బి.వి శ్రీనివాసులు పత్రికా ముఖంగా ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియ జూన్ 1 వతేదీ ఆదివారం స్థానిక క్రీడా మైదానంలో జరిగిన విషయం విదితమే జట్టులో సభ్యులుగా సింధు, ప్రవిత, మధురిమా బాయ్, వైష్ణవి,
హేమ,దివ్య, నసీమా, వర్ష,హర్షిత,నవ్యశ్రీ,దుర్గ,శివగంగా, శ్రీలేఖ, మోక్షిత,గుణశ్రీ, వరలక్ష్మి,ఉషశ్రీ,హర్షిత,లు ఎందుకైనారన్నారు. ఈ జట్టుకు కెప్టెన్ గా సింధు, కోచ్, మేనేజర్ గా మారుతీ కుమార్, అరవింద్ గౌడ్, వ్యవహరించనున్నారు అని తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి, జిల్లా జట్టును విజేతగా నిలపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హాకీ సత్యసాయి జిల్లా సెక్రటరీ సూర్యప్రకాష్, సత్యసాయి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గౌరీ ప్రసాద్,హాకీ సత్యసాయి జిల్లా జాయింట్ సెక్రెటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, ఉడుముల కిరణ్ సత్య సాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హస్సేన్,పాల్గొన్నారు.
ఎంపికైన జిల్లా జట్టుకు హాకీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు బండి వేణుగోపాల్,పల్లెం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర,ట్రెజరర్ అంజన్న, డైరెక్టర్లు మారుతీ,అమునుద్దీన్, ఇర్షాద్, శుభాకాంక్షలు తెలియజేశారు.
సత్య సాయి జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపిక
RELATED ARTICLES