Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆ 12 దేశాల వారు రావద్దు

ఆ 12 దేశాల వారు రావద్దు

. అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ట్రంప్‌ ఉత్తర్వులు
. మరో ఏడు దేశాల పౌరులపైనా ఆంక్షలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీసా నిబంధనల్లో అనేక మార్పులు చేస్తున్నారు. తాజాగా 12 దేశాలపై నిషేధం విధించారు. మరో ఏడు దేశాలపైనా ఆంక్షలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకాలు చేశారు. అఫ్ఘానిస్థాన్‌, మైన్మార్‌, చాద్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో, ఈక్వెటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమెన్‌ దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడానికి వీల్లేదని ట్రంప్‌ ప్రకటించారు. బురుండి, క్యూబా, లావోస్‌, సియోరా లియోన్‌, టోగో, తుర్కమెనిస్థాన్‌, వెనిజులా వంటి మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈనెల 9వ తేదీ రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడిరచారు. తమ దేశంపై ఆంక్షలను వెనిజులా మంత్రి డియోస్టాడో కాబెల్లో ఖండిరచారు. అమెరికాలో ఉండటం మా పౌరులకే కాదు.. వేరే దేశాల ప్రజలకూ ప్రమాదకరమే అని అన్నారు. అమెరికాకు వెళ్లకూడదని, అక్కడ పర్యటించడాన్ని మానుకోవాలని తమ పౌరులకు పిలుపునిచ్చారు. కొలరాడోలోని బోల్డర్‌ కౌంటీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ట్రంప్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు ఉండటం వల్లే అమెరికాలో ఇలాంటి ఘటనలు జరుగుతు న్నాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 2017లో యూరప్‌లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వనని, ముప్పు దేశాల నుంచి బహిరంగ వలసలను అనుమతించ బోనన్న ట్రంప్‌… 12 దేశాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
2,200 మంది అరెస్టు: ఐసీఈ రికార్డు
అమెరికాలో వలసవాదుల వేటలో భాగంగా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు ఒకే రోజులో 2,200 మందిని అరెస్టు చేశారు. ఇది ఐసీఈ చరిత్రలోనే ఒక రికార్డు. ట్రంప్‌ సహాయకులు స్టీఫెన్‌ మిల్లర్‌, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నియోమ్‌ ఇటీవలే ఐసీఈ అధికారులకు కీలకాదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 3వేల మంది వలసదారులను అరెస్టు చేయాలని చెప్పారు. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఐసీఈ అధికారులు ఆల్టర్‌నేటివ్‌ టు డిటెన్షన్‌ (ఏటీడీ) ప్రోగ్రామ్‌ కింద నమోదు చేసుకొన్న వారిని టార్గెట్‌ చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఏటీడీలో నమోదైన వలసదారులను ఐసీఈ కార్యాలయానికి రావాలని అధికారులు సందేశాలు పంపిస్తున్నారు. అలా సందేహాలు అందిన వారు తమ వద్దకు రాగానే అరెస్టు చేస్తున్నారు. బేడీలు వేసి కార్లలో తరలిస్తున్నారు. అలా రాని వాళ్లు డిపోర్టేషన్‌కు గురవుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు