Saturday, June 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివేదమంత్రాల నడుమ ఘనంగా జరిగిన గాయత్రి దేవి జయంతి వేడుకలు

వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగిన గాయత్రి దేవి జయంతి వేడుకలు

అర్చకులు సంపత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ గాయత్రి దేవాలయంలో గాయత్రీ దేవి జయంతి వేడుకలను అర్చకులు సంపత్ కుమార్, ధర్మవరం అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. సందర్భంగా అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు, పంచలోహ లతో అలంకరణ, వివిధ ఆభరణాలతో, వివిధ పూలబాలలతో అలంకరించిన వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు సంపత్ కుమార్ వివిధ అర్చనలు, అభిషేకాలు, పచ్చపతాభిషేకములు నిర్వహించారు. అనంతరం భక్తాదుల పేరిటను ప్రత్యేక పూజలను నిర్వహించారు. గీత ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ జయంతి వెలుగులకు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు