Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ

విద్యా రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం – హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం పట్టణంలోని కొత్తపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఈరోజు పాఠశాల పునఃప్రారంభ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు విద్యాసంబంధిత అనేక సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద ఈ పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాసౌకర్యాలను అందిస్తోంది అని తెలిపారు.. ఇది విద్యా రంగాన్ని నూతన దిశగా తీసుకెళ్తుంది అని పేర్కొన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు యూనిఫార్మ్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్స్‌లు, బెల్ట్, టై, నోట్‌బుక్స్, డిక్షనరీలు, అదనంగా, మధ్యాహ్న భోజన పథకం కింద ఇకపై విద్యార్థులకు సన్నబియ్యం తో తయారైన భోజనం అందించనున్నారు అని తెలిపారు. ప్రారంభ దశలోనే విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అలాగే హరీష్ బాబు విద్యా మిత్ర పథకాన్ని కొనియాడుతూ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న ఈ చర్యల్ని ప్రశంసించారు. పాఠశాల ప్రారంభాన్ని ఈ విధంగా ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా, విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ వైపు నుండి గల నిబద్ధత స్పష్టమవుతుంది. సేవలోనే శ్రేష్ఠత – విద్యలోనే వికాసం అనే విధానంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలపరిచి, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజేశ్వరి దేవి, ఎంఈఓ2 గోపాల్ నాయక్, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, కోటిరెడ్డి రాజా రెడ్డి, బిల్లే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు