కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంద్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు 380 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను వైద్యులు, సిస్టర్ ల చేతులు మీదుగా అందజేశారు. ప్రత్యేకంగా గర్భిణీలకు స్వీట్లు కూడా వారు పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతో, పుట్టపర్తి సత్య సాయిబాబా ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, నేడు ఈ సేవా కార్యక్రమానికి దాతగా అరిగల పోతన హాస్పిటల్, మౌషిక్ సాయి నందన్ వారు వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలని వారు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 99 66047044 కు గాని 903044065కు గాని సంప్రదించారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు వరంలాగా మారడం జరిగిందని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తరపున శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి, సంతోషం..
RELATED ARTICLES