రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షుడు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో ఈనెల 17వ తేదీ ప్రపంచ రక్త దాతల దినోత్సవం వేడుకల్లో భాగంగా రక్త దాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు రజనీ ట్రస్టు, రక్త బంధం ట్రస్టు అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ 17వ తేదీ ప్రపంచ రక్త దాతల దినోత్సవం ఎంతో ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించుకున్నదని, అందుకే ఆ రోజున రక్తదాన శిబిరమును నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు కూడా విచ్చేసి వారి చేతులు మీదుగా చిరు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. కావున ఆసక్తిగల రక్త దాతలు ఈ శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈనెల 17న రక్తదాన శిబిరం..
RELATED ARTICLES