స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త డాక్టర్ సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని ఆకుతోటపల్లి నాగుల కట్ట వద్ద ధర్మపురి పంచాయితీ లో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త డాక్టర్ సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫెర్రర్ వర్ధంతిని ప్రాముఖ్యమైన రోజులుగా భావించి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహక దినోత్సవముగా ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తొలుత స్వచ్ఛంద సంస్థల తో సమావేశాన్ని నిర్వహించి ఫెర్రర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. తదుపరి సంస్థ అధినేత సోమల రాజు శివరాజు ఆదేశాల మేరకు పంటి వైద్యులు మనోజ్ కుమార్, నేత్ర సహా వైద్యులు నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆరోగ్య విషయాలపై పలు విషయాలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. నోరు మంది వృద్ధులకు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామాలలో ఇటువంటి శిబిరాలను నిర్వహించదలిచాము అని వారు స్పష్టంగా తెలిపారు. హాట్ ఫుల్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు, బళ్లారి కుంటిమల సత్యనారాయణ, ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ కేత లోకేష్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ఐక్యత కోసం బలోపితం కోసం వర్ధంతి సందర్భంగా ప్రోత్సాహిక దినంగా ప్రకటించడం, సమాచార వికాసానికి స్వచ్ఛంద సంస్థల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ప్రతినెల ఆకుతోటపల్లి గ్రామంలో నా సొంత గ్రామం అయినందున స్వచ్ఛంద కార్యకర్తగా ప్రతినెల సేవా కార్యక్రమాల్లో పాల్గొని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తదుపరి గ్రామ ప్రజలు కృతజ్ఞతలను తెలియజేశారు.
గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఎంతో అవసరం
RELATED ARTICLES