Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేదల పెన్నిధి వైయస్ జగన్మోహన్ రెడ్డి… వైఎస్సార్సీపి పట్టణ నాయకులు

పేదల పెన్నిధి వైయస్ జగన్మోహన్ రెడ్డి… వైఎస్సార్సీపి పట్టణ నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో వైయస్సార్ సిపి పార్టీ ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేతిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి హాజరై, తన చేతుల మీదుగా కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైయస్సార్ విగ్రహానికి పూలల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి,గుర్రం శ్రీనివాస్ రెడ్డి, చందమూరి నారాయణరెడ్డి, బాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలుపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారు కొనియాడారు. ఎన్నికల సమయాలలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం జరిగిందన్నారు. పేదల పెన్నిధి వైయస్ జగన్ రెడ్డి అని, వైసిపి హయాంలోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వం ఎన్నో అపద్దాల హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా మోసం చేసిందని వారు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పేదల పక్షాన నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ రమేష్, బడన్నపల్లి కేశవరెడ్డి, ముసవల్లి, సాయి, చౌడప్ప ,బాల్రెడ్డి, కునుటూరు గోపాల్ ,సుభాన్, కరీం, వార్డు కౌన్సిలర్లు, నాయకులు,ఇన్చార్జిలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు