Homeజాతీయంవిజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ

విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ

- Advertisement -

నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులు
పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడి

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు సి.జోసెఫ్ విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఉపసంహరించారు. బుధవారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆయన కాన్వాయ్‌తో పాటు ఇతర భద్రతా ఏర్పాట్లను వెనక్కి తీసుకుంది. అయితే, టీవీకే పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

2025 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీవీకే భారీ విజయం దిశగా దూసుకెళ్లిన వెంటనే, మే 4వ తేదీన విజయ్ నివాసం, పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను భారీగా పెంచారు. ముఖ్యమంత్రికి కల్పించే ఃజెడ్-ప్లస్ః స్థాయికి సమానంగా ఈ భద్రత కొనసాగింది. ఒక డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో, పదుల సంఖ్యలో కమాండోలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులను కూడా ప్రత్యేక డ్యూటీలో నియమించారు.

అయితే, కాన్వాయ్ లేదా ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్ తమకు వద్దని టీవీకే సీనియర్ నేతలు కోరినట్టు ఓ అధికారి తెలిపారు. వారి అభ్యర్థన మేరకు భద్రతను తగ్గించి, ప్రత్యేక డ్యూటీలో ఉన్న అధికారులను తిరిగి వారి పాత పోస్టింగులకు పంపినట్టు వివరించారు.

అదే సమయంలో, విజయ్‌కు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఃవైః కేటగిరీ భద్రత యథాతథంగా కొనసాగుతుందని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (్పు=Pఖీ) సిబ్బంది ఆయన ప్రయాణాల్లో, నివాసం వద్ద భద్రత కల్పిస్తారు. దీనికి తోడు పార్టీ నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు