దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.
పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు చేరువ కావడంతో ప్రజలు భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకు చేరగా, మే 20న అది 265 గిగావాట్లకు పెరిగింది. జూన్లో ఇది 271 గిగావాట్లు, జూలైలో 283 గిగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వరుసగా మూడో రోజు దేశంలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్
విద్యుత్ శాఖ సోషల్ మీడియా వేదికగా తెలిపిన ప్రకారం, మే 20తో వరుసగా మూడో రోజు దేశంలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైంది. అయితే పెరిగిన డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు. మే 21న కూడా దేశంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. మధ్యాహ్నం 3:45 గంటలకు సోలార్ అవర్స్ సమయంలో విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
ఇది అంతకుముందు రోజు నమోదైన రికార్డును కూడా అధిగమించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు
అధికారుల ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అధికంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా జాతీయ రాజధాని దిల్లీలో గత 14 ఏళ్లలోనే అత్యంత వేడిగానున్న రాత్రులు నమోదవుతున్నాయి. రాష్ట్ర లోడ్ పంపిణీ కేంద్రం (SLDC) గణాంకాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3:31 గంటలకు ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ 8,231 మెగావాట్లకు చేరింది. ఇది 2024 మే 29న నమోదైన 8,302 మెగావాట్ల ఆల్టైమ్ మే రికార్డుకు కాస్త తక్కువ. ఈ పెరుగుతున్న డిమాండ్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది.
విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరాను కొనసాగిస్తాం
అదనపు కార్యదర్శి పీయూష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, వేసవి కాలమంతా థర్మల్ పవర్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలంలో ఎలాంటి మెయింటెనెన్స్ షట్డౌన్లకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయితే సాధారణంగా ఉండే 30 రోజుల నిల్వలతో పోలిస్తే ప్రస్తుతం 18 రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అనంతరం ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వంటి పరిణామాలు గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక మార్గంగా హోర్ముజ్ జలసంధి పరిగణించబడుతోంది.
జాతీయ లోడ్ పంపిణీ కేంద్రం (NLDC), ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాలు (RLDCs), రాష్ట్ర లోడ్ డిస్పాచ్ కేంద్రాలు (SLDCs), విద్యుత్ ఉత్పత్తి సంస్థల మధ్య సమన్వయంతో విద్యుత్ సరఫరాను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన షెడ్యూలింగ్, రియల్టైమ్ మానిటరింగ్ ద్వారా పెరుగుతున్న డిమాండ్ను ప్రభుత్వం నియంత్రిస్తోంది.
వరుసగా మూడో రోజు దేశంలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్
విద్యుత్ శాఖ సోషల్ మీడియా వేదికగా తెలిపిన ప్రకారం, మే 20తో వరుసగా మూడో రోజు దేశంలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైంది. అయితే పెరిగిన డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించామని అధికారులు పేర్కొన్నారు. మే 21న కూడా దేశంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. మధ్యాహ్నం 3:45 గంటలకు సోలార్ అవర్స్ సమయంలో విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
ఇది అంతకుముందు రోజు నమోదైన రికార్డును కూడా అధిగమించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు
అధికారుల ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అధికంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా జాతీయ రాజధాని దిల్లీలో గత 14 ఏళ్లలోనే అత్యంత వేడిగానున్న రాత్రులు నమోదవుతున్నాయి. రాష్ట్ర లోడ్ పంపిణీ కేంద్రం గణాంకాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3:31 గంటలకు ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ 8,231 మెగావాట్లకు చేరింది.ఇది 2024 మే 29న నమోదైన 8,302 మెగావాట్ల ఆల్టైమ్ మే రికార్డుకు కాస్త తక్కువ. ఈ పెరుగుతున్న డిమాండ్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది.
విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరాను కొనసాగిస్తాం
అదనపు కార్యదర్శి పీయూష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, వేసవి కాలమంతా థర్మల్ పవర్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలంలో ఎలాంటి మెయింటెనెన్స్ షట్డౌన్లకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయితే సాధారణంగా ఉండే 30 రోజుల నిల్వలతో పోలిస్తే ప్రస్తుతం 18 రోజుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అనంతరం ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వంటి పరిణామాలు గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక మార్గంగా హోర్ముజ్ జలసంధి పరిగణించబడుతోంది. జాతీయ లోడ్ పంపిణీ కేంద్రం , ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాలు , రాష్ట్ర లోడ్ డిస్పాచ్ కేంద్రాలు , విద్యుత్ ఉత్పత్తి సంస్థల మధ్య సమన్వయంతో విద్యుత్ సరఫరాను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన షెడ్యూలింగ్, రియల్టైమ్ మానిటరింగ్ ద్వారా పెరుగుతున్న డిమాండ్ను ప్రభుత్వం నియంత్రిస్తోంది.


