ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.కామ్ తృతీయ సంవత్సరం విద్యార్థి కట్టుబడి హేమంత్ కుమార్ జాతీయ సమైక్యత శిబిరాని ((ఎన్.ఐ.సి.) కి ఎంపికైనట్లు ప్రిన్సిపల్, డా. కె. ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా కళాశాలలో బీ.కాం., మూడవ సంవత్సరం చదువుతున్న హేమంత్ కుమార్ మహారాష్ట్ర లోని శివాజీ యూనివర్సిటీ కొల్హాపూర్ లో ఫిబ్రవరి 16 నుండి 22 వ, తేదీ వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొంటాడని తెలిపారు. మనదేశ వారసత్వ, సంస్కృతి, ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యకలాపాలు, యువకులు, విద్యార్థులకు అవగాహన, సామాజిక సేవలు, దేశ సేవ, దేశ అభివృద్ధి మరియు జాతియ సమగ్రతకు పాటుపడేలా భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాల మంత్రిత్వ మరియు క్రీడాశాఖ,ఎన్.ఎస్.ఎస్. ప్రాంతీయ డైరెక్టరేట్, పూణే ల అధ్వర్యంలో జాతీయ సమైక్యత సిబిరం నిర్వహిస్తున్నారని తేలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ తో పాటు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా.బి.గోపాల్ నాయక్, పలువూరు అధ్యాపకులు, విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కె.హేమంత్ కుమార్ ను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ సమైక్యత శిబిరానికి విద్యార్ధి కె.హేమంత్ కుమార్ ఎంపిక…
RELATED ARTICLES