మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడి మృతదేహం లభ్యమయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల గల్లంతు
RELATED ARTICLES