ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈరోజు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేశ్ తమ ఓటు వేశారు. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే, వీరిలో కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్), ఆలపాటి రాజేంద్రప్రసాద్ (కూటమి) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
RELATED ARTICLES