- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ ప్రక్కనే కల రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ మద్యం కేసులో పట్టుబడిన వాహనాలను మార్చి నెల ఒకటవ తేదీన స్టేషన్ ఆవరణంలో బహిరంగ వేరమును నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి కలవారు బహిరంగ వేళలో పాల్గొన వచ్చునని తెలిపారు. వేలం ముగిసిన అనంతరం హెచ్చుపాట దారులకు వాహనాలను ఇవ్వడంతో పాటు నిబంధనల మేరకు వాహనాలకు నూతన రికార్డులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


