గురుగ్రామ్: సామ్సంగ్ వచ్చే వారం భారతదేశంలో మూడు కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గెలాక్సీ ఎ భారతదేశంలో సామ్సంగ్ అత్యంత విజయవంతమైన స్మార్ట్ఫోన్ సిరీస్, సామ్సంగ్ ప్రతి సంవత్సరం లక్షలాదిగా ఈ ఫోన్లను విక్రయిస్తుంది. కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్ఫోన్లు గత సంవత్సరం విడుదల చేసిన గెలాక్సీ ఎ 35 మరియు గెలాక్సీ ఎ 55 స్మార్ట్ఫోన్ల వారసత్వాన్ని కలిగిఉంటాయి. గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్ఫోన్లు కొత్త డిజైన్, మెరుగైన మన్నిక, అధునాతన భద్రతను కలిగి ఉంటాయి, ఇవి సౌకర్యవంతమైన, సురక్షితమైన వినియోగదారు అనుభవాన్ని నిర్ధారిస్తాయి. సంవత్సరాలుగా, సామ్సంగ్ గెలాక్సీ ఎ సిరీస్కు తమవైన రీతిలో ప్రతిష్టాత్మక ఫీచర్లను పరిచయం చేసింది.