చెన్నై : దీపావళి రోజున ఇద్దరు తమిళ సూపర్స్టార్లు రజనీకాంత్, అజిత్ నటించిన ‘అణ్ణాత్త’, ‘వలిమై’ చిత్రాలు విడుదల కానున్నాయి. వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా రజనీ నటిం చిన ‘పేట’, అజిత్ నటించిన ‘విశ్వాసం’ చిత్రాలు దీపావళికి విడుదల య్యాయి. శివ దర్శ కత్వం వహించిన ‘విశ్వాసం’ విజయం సాధించింది. ‘అణ్ణాత్త’కు శివ దర్శకత్వం వహించగా, అజిత్ నటించిన ‘వలిమై’ చిత్రాన్ని హెచ్. వినోద్ తెరకెక్కించారు. ‘అణ్ణాత్త’లో రజనీకాంత్తోపాటు ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్రాజ్, సూరి, సతీష్ ముఖ్య పాత్రల్లో నటించగా, ‘వలిమై’లో అజిత్తో పాటు హ్యూమా ఖురేషీ, కార్తికేయ, యోగిబాబు వంటి ప్రముఖ తారాగాణం నటించారు. ఇదిలా ఉంటే, షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘అణ్ణాత్త’ చిత్రాన్ని నవంబరు 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు నిర్మాణ సంస్థ సన్పిక్చర్స్ అధికారికంగా వెల్లడిరచింది. అలాగే, ఇటీవల క్లైమాక్స్ పూర్తి చేసుకున్న ‘వలిమై’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని కూడా దీపావళికి విడుదల చేసేలా చిత్ర నిర్మాత బోనీకపూర్ ప్లాన్ చేశారు. నిజానికి ‘వలిమై’ చిత్రాన్ని దసరాకే విడుదల చేయాలనుకున్నా కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఈ చిత్రం దీపావళి రేసులోకి వచ్చింది. కాగా అగ్ర హీరోలు నటించిన ఈ రెండు సినిమాలను వేర్వేరు తేదీల్లో విడుదల చేయాలని థియేటర్ యజమానులు కోరుతున్నారు.