ఏపీ రైతు సంఘం జిల్లా అద్యక్షులు చిన్నప్ప యాదవ్
విశాలాంధ్ర -శింగనమల : శింగనమల నియోజకవర్గం కేంద్రంలో ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏపిరైతుసంఘం అద్వర్యములో శుక్రవారం శింగనమల సీపీఐ కార్యాలయములో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ
శింగనమలనియోజకర్గవ్యాప్తంగా ఉద్యానపంటలు అరటి,చీనీ,నిమ్మ,దానిమ్మ,జామ,రేగు,అల్లనేరడి,సపోట, చింత,డ్రాగన్ ఫ్రూట్ ,అంజూర,బంతి,చామంతి,లీల్లీపూలు,మునగ,కాయగూరలు పంటలుఅనేకమైనఉద్యానపంటలు పండిస్తున్నారు,
కానిహర్టికల్చరల్ అధికారులు రైతులకుఅందించే ప్రోత్సహకాలు గురించి అడగాలంటే మూడు నాల్గు మండలాలుగా ఉద్యానవన శాఖఅదికారి ఒక్కరేఉన్నందున రైతులు తీవ్ర ఇబ్బందులుపడుచున్నారు,
కావునశింగనమలని యోజకవర్గకేంద్రంలో ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాలుకు రెగ్యులర్ ఉద్యానశాఖ అధికారులను నియమించాలని, హర్టికల్చరల్ రైతులు చాలామంది బోరుబావులు ఎండిపోయి రైతుల అప్పుల పాలైనారని, అందుకోసం ప్రభుత్వం మండలానికి ఒక జియాలజీస్ట్ అధికారిని, నియమించి రైతులకు ఉచితంగా బోర్లు వేసి, ఉద్యాన పంటలకు ఉచిత పంటల బీమా విధానాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ రంగ సంస్థలకే బీమా ప్రీమియాన్ని చెల్లించే విధంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు వచ్చేంతవరకు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయాలని, టమోటా, చీని, పండ్ల జ్యూస్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వమేనర్సరీలు ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలను కాయగూరల నారును రైతులకు ఉచితంగా అందించాలన్నారు. రైతులకు ఎరువులు డ్రిప్ మందులు 75శాతం తో అందించాలని అనంతపురంజిల్లానుహర్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలంటేఉద్యానరైతులకుసరైనప్రోత్సహకాలుఅందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, రైతు సంఘం మండల కార్యదర్శి కే చంద్రశేఖర్, సీపీఐ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, రామాంజనేయులు ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.