Wednesday, June 4, 2025
Homeజిల్లాలుఅనంతపురంధర్మవరం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో,2024 వ సంవత్సరం లో జరిగిన హత్య కేసు చేధింపు…

ధర్మవరం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో,2024 వ సంవత్సరం లో జరిగిన హత్య కేసు చేధింపు…

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడి

ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య,
ముగ్గురు నేరస్థుల అరెస్టు

విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి;;అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని, ప్రియుడితో భర్తను హత్య చేయించిన కేసులో ఇందులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
2024 సంవత్సరంలో జరిగిన ఈ హత్య కేసును ధర్మవరం రూరల్ పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో, హత్య చేసిన నిందితులను కనుగొని వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ తో కలిసి జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ హత్య కేసులో ముద్దాయి వివరాలను తెలుపుతూ
సిద్దప్ప @ సిద్దు, బీసీ.కాలనీ, ఆర్ .లోచర్ల గ్రామము, రొద్దం మండలం,నూర్ మహమ్మద్, ఉటకురు గ్రామము, పరిగి మండలం,
మదన మోహన్ , హుస్సేనాపురం గ్రామము, పావగడ తాలూకా, టుముకూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం, ప్రస్తుతం పరారీలో ఉన్నవారిలో
మోహన్ ఆర్ ఎల్ కొత్తూరు, గ్రామము, రొద్దం మండలం, (పరారీలో ఉన్నాడు),అల్లే యమునా, పోతుకుంట గ్రామము, ధర్మవరం మండలం. (మృతుని భార్య, పరారీలో ఉన్నది.) అని తెలిపారు.అల్లే మంజునాథ్, వయస్సు:32 సం,లు, తండ్రి:అల్లే నారాయణ, కులము: కురుబ, పోతుకుంట గ్రామము, ధర్మవరం మండలం లో నివాసము ఉంటూ డ్రైవర్ గా పనిచేసేవాడు అని తెలిపారు. ఒక కొడుకు, ఒక కూతురు సంతానం కలదని తెలిపారు.
ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ అధ్వర్యంలో, ధర్మవరం రూరల్ సర్కిల్, సీఐ .ప్రభాకర్ ధర్మవరం రూరల్ ఎస్సై పి.శ్రీనివాసులు తమ సిబ్బంది తో పాటు జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 3.00 గం,ల సమయంలో ధర్మవరం మండలం, పోతుకుంట గ్రామములోని శివాలయం వద్ద ముద్దాయిలను అరెస్ట్ చేయడమైనది అని తెలిపారు.పోతుకుంట గ్రామానికి చెందిన అల్లే మంజునాథ్ 12 సంవత్సరాల క్రితం రామగిరి మండలం, పోలేపల్లి గ్రామానికి చెందిన యమున తో వివాహం అయినది అని, వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం కలదని తెలిపారు. వీరు బ్రతుకుతెరువు కోసం పెనుకొండ లో నివాసం ఉండేవారన్నారు. మంజునాథ్ తాగుడుకు అలవాటుపడి తన భార్య ప్రవర్తన పై తరచూ గొడవపడుతుండేవారు అని తెలిపారు. అయితే 2023 వ సంవత్సరం నుండి A1 ముద్దాయి అయిన సిద్దప్ప కు, మంజునాథ్ భార్య యమునకు పరిచయము వీరి ఇద్దరి మద్య అక్రమ సంబంధమునకు దారి తీసింది అని తెలిపారు. ఆ క్రమములో యమున ఎలాగైనా మంజునాథ్ ను చంపాలని ముద్దాయి అయిన సిద్దప్ప, యమున పై ఒత్తిడి చేయగా తన స్నేహితులైన నూర్ మహమ్మద్,మదన మోహన్, పిట్టి లతో కలిసి 22.04.2024 వ తేదిన మంజునాథ్ ను ధర్మవరం మండలం, నాగలూరు గ్రామము వద్ద గల పెద్ద వంక లోకి మద్యము త్రాగడానికి పిలుచుకొని వెళ్లి మంజునాథ్ కు అతిగా మద్యం తాగించి పధకం ప్రకారం వారు తెచ్చుకున్న టవల్ ను మంజునాథ్ మెడకు బిగించి మంజునాథ్ ను హత్య చేసినారు అని తెలిపారు.ఒక సంవత్సరం క్రితం డెత్ కేస్ నాట్ నొన్ గా నమోదు చేసిన కేసును చేధించిన ప్రస్తుత ధర్మవరం రూరల్ సర్కిల్, సీఐ.ప్రభాకర్ , ధర్మవరం రూరల్ ఎస్సై పి.శ్రీనివాసులు , వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ చత్రు నాయక్, కానిస్టేబుల్స్,అనిల్ కుమార్,.బాలకృష్ణ ,సత్యసాయి జిల్లా, యస్.పి శ్రీమతి వి.రత్న ప్రశంస పత్రాలు క్యాష్ రివార్డ్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో
విలేకరుల సమావేశంలో ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్, ఎస్బిసిఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐ ప్రభాకర్, ఎస్సై శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు