ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై వారు చర్చిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ాఆపరేషన్ సిందూర్్ణ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 80మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈక్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.