Sunday, January 18, 2026
Homeజిల్లాలువిశాఖపట్నంరెవెన్యూ సదస్సులు

రెవెన్యూ సదస్సులు

- Advertisement -

రైతులందరూ సద్వినియోగం చేసుకోండి
తాసిల్దార్ పేర్లి శ్యాం ప్రసాద్

విశాలాంధ్ర- ఆనందపురం (విశాఖ జిల్లా ) : ఆనందపురం మండలంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాల పరిధిలోని రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీక రించేందుకు ఈ నెల 6 నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వ హించనున్నట్లు తహసీల్దార్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ సద స్సులలో అన్ని రకాల భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిసా మన్నారు.తహసీల్దారు లేదా ఆస్థాయి అధికారులుసదస్సులలో పాల్గొంటారు. రెవిన్యూ గ్రామ సదస్సులలో ఇచ్చే వినతులు, ఫిర్యాదులపై 45 రోజుల్లో పరిష్కారాలను చూపిస్తారు. అలాగే సర్వే రాళ్లపై గతంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ బొమ్మలను తొలగించివేయడానికి చర్యలు తీసుకుంటారు.

ఈనెల 6 న గొట్టిపల్లి, 7 న కుసులువాడ, 9 న గిడిజాల 10 న ఆనందపురం, 11 న రామవరం, 12 న దబ్బంద, 13 న కనమాం, గోరంట 16 న ఎన్ జి ఆర్ పురం – 2, 17 న ఎన్ జి ఆర్ పురం-2,18 న భీమన్నదొరపాలెం, 19 న కోలవానిపాలెం, 20 న పాలవలస, 21 న పందలపాక, బాకురుపాలెం రెవెన్యూ గ్రామాలలో సదస్సులు ఉంటాయి. అలాగే 23 న గుడిలోవ 27 నతర్లువాడ, 28 న చందక, 30 న జగన్నాధపురం, 31 న ముకుం దపురం, పేకేరు జనవరి 2 న అనందపురం, 3 న పెద్దిపాలెం, వెల్లంకి 4 న గండిగుండం, 6 న గంభీరం, 7 న తంగుడిబిల్లి, ముచ్చర్ల 8 న శిర్లపాలెం, బోని గ్రామాలలో రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహించి బడునని తహసిల్దార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు