విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల 17వ వార్షికోత్సవ వేడుకలు మార్చి 1న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ ఎం. రమేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ, ఎన్ కన్నయ్య నాయుడు , ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అడ్వైజర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ . కృష్ణయ్య హాజరు కానున్నారని అన్నారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.