శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన ఉద్యోగుల బదిలీల పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు విబి భాస్కర్ రెడ్డి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ఎప్పటికప్పుడు అటు ఉన్నతాధికారులను, ఇటు ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుంటూ, బదిలీల గురించి తగు సూచనలను జారీ చేస్తూ, బదిలీలకు అత్యంత పారదర్శకంగా జరగడానికి కృషిచేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడా కూడా ఏ స్థాయిలోనూ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు ఇంత పెద్ద ఎత్తున జరగడం అరుదైన అంశము అని తెలిపారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగడానికి కృషిచేసిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శికృష్ణ బాబు, డైరెక్టర్లకు ఇతర ఉన్నతాధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపినట్లు వారు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రిటెన్షన్లు, పోస్టింగులు ఇవ్వడం జరిగిందని మా సంఘం ద్వారా సంతృప్తిని తెలియపరుస్తున్నామని తెలిపారు. బదిలీల తర్వాత మా వంతు కర్తవ్యాన్ని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తామని వారు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడైనా ఉద్యోగులకు పొరపాట్లు తప్పులు జరిగితే మా దిష్టికి తీసుకొని రావాల ననితెలిపారు. తదుపరి ఆ సమస్యలకు పరిష్కార దిశగా ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన ఉద్యోగుల బదిలీల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
RELATED ARTICLES