Saturday, April 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంవిద్యార్థులకు అగ్నిమాపక నివారణ పై అవగాహన

విద్యార్థులకు అగ్నిమాపక నివారణ పై అవగాహన

విశాలాంధ్ర -అనంతపురం : అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమం లో బాగంగా అనంతపురం నగరంలోని చైతన్య స్కూల్ టవర్ క్లాక్ బ్రాంచ్ నందు గురువారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినప్పుడు నీ విధంగా నివారించాలో విద్యార్థులకు ఏ డి ఎఫ్ ఓ కె పి లింగమయ్య అవగాహన కల్పిస్తూ డెమో ద్వారా వివరంగా తెలియజేయడం జరిగింది. ఇందులో బాగంగా మొదటిగ అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే పొగ గదుల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించవలెను అక్కడ చిక్కుకున్న వ్యక్తులను రెస్క్యూ మెథడ్స్ ద్వారా పైనంతస్తుల నుండి వారిని రక్షించి సహాయ చర్యలను అందించే విధానాన్ని తెలియజేశారు.విద్యార్థులు, విద్యార్థినిలు స్కూల్ బోదన సిబ్బందికి ప్యానిక్ కాకుండా మనసులో అలజడి చెలరేగకుండా ఏ విధంగా పై అంతస్తుల నుండి కిందికి ఎరాక్యులేషన్ ద్వారా తొక్కిసలాటలేకుండా ప్రజలు అప్రమత్తంగా వచ్చే విధంగా ఉండే రెస్యూ మెథడ్స్ ని చేసి చూపించడం జరిగింది. అలాగే పై అంతస్తు నుండి చైర్ నాట్ సహాయంతో పై అంతస్థులలో ప్రమాదాలలో చిక్కుకొని సృహ కోల్పోయిన వ్యక్తులను ఎలా కిందికి దింపవచ్చును అనునది డెమో ద్వారా చేసి నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించదమైనది మరియు కరపత్రములు పంచడమైనది. ప్రజలు మరియు విద్యార్థులు స్టయిర్కేసు ద్వారా ఎవకుయేషన్ డ్రిల్ చేసి వారికి ఎటువంటి ప్రమాదము కలిగిన ఎలా పై అంతస్తు నుండి కిందికి రావడం మరియు పై అంతస్తులలో చిక్కుకున్న ప్రజలను గాని సిబ్బందిని గాని ఏ విధంగా కాపాడగలము అని రెస్క్యూ మెథడ్స్ ద్వారా తెలపడం జరిగినది. గ్యాస్ ఫైర్ జరిగిన యడల సి ఓ 2 ద్వారా ఏవిధంగా వాటిని నివారించవచ్చు, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా కాపాడవచ్చును అనునటువంటి అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినది. అక్కడి ప్రజలు మరియు సెక్యూరిటీ సిబ్బందికి ఇలాంటి ఎన్నో రకాల అగ్నిమాపక నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రాణ మరియు ఆస్తి నష్టాలను కాపాడుకోవచ్చునని తెలియజేశారు. స్కూల్ నందు ఎటువంటి అగ్ని నివారణ పరికరములు ఉంచుకోవలెను ఎటువంటి జాగ్రత్తలు తెసుకోవలెను అనేవిషయాలను విద్యార్థులు, విద్యార్థినిలు, స్కూల్ బోదన సిబ్బందికి ప్రిన్సిపల్ మరియు మేనేజర్ గోపాల్ కి జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి కె. పి లింగమయ్య తెలియజేసినరు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ నందు అవగాహన కొరకై వాల్ పేపర్స్ అతికించడమైనది.
అవగాహన కార్యక్రమంలో ఎల్ ఎఫ్ లు జి. గోవింద రాజులు , ఎస్. రమేష్ కుమార్ రెడ్డి , ఈ.ఈరేష్ గౌడ్ డి ఓ పి,ఎఫ్ ఎం లు సి. మధుసూదన, వై. ఓబీ రెడ్డి, జి. శ్రావణ కుమార్ , జి. తిప్పే స్వామి, కే.జయరాముడు , కే. అనిల్ కుమార్ , బి. సుధాకర్ , ఏం.రమేష్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు