Thursday, April 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభగవద్గీత శ్లోకములో పోటీల్లో బ్రిలియంట్ స్కూల్ ప్రతిభ

భగవద్గీత శ్లోకములో పోటీల్లో బ్రిలియంట్ స్కూల్ ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; భగవద్గీత శ్లోక పోటీల్లో ధర్మవరం శివానగర్ లోని బ్రిలియంట్ స్కూల్ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరచడం జరిగిందని కరెస్పాండెంట్ సివి శేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంలోని ఇస్కాన్ వారు నిర్వహించిన భగవద్గీత శ్లోక పారాయణము నందు మా పాఠశాల నుంచి 70 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతంగా శ్లోకములను పారాయణం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అనంతపురం ఇస్కాన్ అధ్యక్షులు సత్య గోపీనాథ్ దాస్ నుండి ప్రశంసా పత్రములను పొందడం జరిగిందని తెలిపారు. చదువుతోపాటు మన ఆధ్యాత్మిక , భగవద్గీత లాంటి చదవడం వల్ల మంచి మేధస్సు కూడా కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, లక్ష్మీదేవి, సుబ్బరాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు