Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపండుగ వాతావరణంలో బక్రీదును నిర్వహించుకోండి.. ఎంపీడీవో సాయి మనోహర్

పండుగ వాతావరణంలో బక్రీదును నిర్వహించుకోండి.. ఎంపీడీవో సాయి మనోహర్

విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీన నిర్వహించబడే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు, సోదరీమణులు పండుగ వాతావరణంలోగా చక్కగా జరుపుకోవాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని పలు పంచాయతీలలో పలు గ్రామాలలో గల ఈద్గా తోపాటు మసీదుల వద్ద పరిశుభ్రతను చేయించారు. చెత్తాచెదారం ఎక్కడ కనపడకుండా సచివాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. మసీదు, ఈద్గా ఉన్న ప్రదేశాలలో ముస్లిం సోదరులు చక్కటి వాతావరణంలో ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలంగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో ఉండే ముస్లింలు ఎంపీడీవో చేపట్టిన ఈ పరిశుభ్రత పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ఎంపీడీవో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉండే ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు