Monday, April 21, 2025
Homeఅంతర్జాతీయంపోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల చంద్రబాబు,జగన్, నారా లోకేశ్ స్పందన

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల చంద్రబాబు,జగన్, నారా లోకేశ్ స్పందన

క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వినయం, కరుణ, శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిన ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం తనకు చాలా బాధ కలిగించిందని చంద్రబాబు ఃఎక్స్ః వేదికగా పేర్కొన్నారు. మానవాళిని ప్రేమ, దయతో నడిపించారని కొనియాడారు. శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ప్రపంచ క్యాథలిక్ సమాజానికి తన సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక నాయకత్వంలో తరతరాలకు పోప్ ఫ్రాన్సిస్ స్ఫూర్తిగా నిలిచారని నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను స్పృశించారని మంత్రి పేర్కొన్నారు.

పోప్ మృతి వార్త ఎంతగానో కలచివేసింది: జగన్
క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణవార్త తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సంతాపాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చికి అధినేతగా విశేషమైన సేవలు అందించారని జగన్ కొనియాడారు. ఆయన హయాంలో చర్చి వ్యవస్థలో పరివర్తనాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రీస్తు విశ్వాసులపై ఆయన చెరగని ముద్ర వేశారని తెలిపారు. లాటిన్ అమెరికా ప్రాంతం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి వ్యక్తిగా పోప్ ఫ్రాన్సిస్ చరిత్ర సృష్టించారని జగన్ కీర్తించారు.

పోప్ ఫ్రాన్సిస్ కేవలం మత పెద్దగానే కాకుండా, ఒక నిజమైన మానవతావాదిగా నిలిచారని వైఎస్ జగన్ అభివర్ణించారు. ప్రపంచ శాంతి కోసం… పేదలు, అణగారిన వర్గాల పట్ల కరుణ చూపడంలో ఆయన ఎల్లప్పుడూ ముందున్నారని కొనియాడారు. ఆయన వినయం, మానవత్వం ప్రపంచాన్ని ఎంతగానో స్పృశించాయని పేర్కొన్నారు. శాంతి, కరుణ కోసం ఆయన గొంతుక ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని తెలిపారు.పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచానికి, ముఖ్యంగా క్యాథలిక్ సమాజానికి ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు