Thursday, May 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివేసవి శిక్షణ శిబిరాలకు ముఖ్య కార్యదర్శి రమ ఆకస్మిక తనిఖీ

వేసవి శిక్షణ శిబిరాలకు ముఖ్య కార్యదర్శి రమ ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 9వ రోజుఉచిత వేసవి శిక్షణ శిబిరాలు గ్రంధాలయ ముఖ్య కార్యదర్శి రమా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణా శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుకు బాట వేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తమకు ఉన్న అనుకూల సమయంలో గ్రంథాలయములో వివిధ రకాల పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం వెన్నెల టీచర్ చే తెలుగు కథలు చెప్పడం ఇంగ్లీష్ గ్రామర్ పిల్లలకు బోధించడం జరిగిందన్నారు. ధ్యాన యోగం కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు