Monday, June 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ముగిసిన రాయలసీమ నృత్యత్యోత్సవపు ముగింపు వేడుకలు

ఘనంగా ముగిసిన రాయలసీమ నృత్యత్యోత్సవపు ముగింపు వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కూచిపూడి కళా కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ నృత్యోత్సవపు ముగింపు వేడుకలు బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, అడహక్కు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్, లక్ష్మి గోవింద చౌదరి, పుల్లయ్య, కలవల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందంశెట్టి జగదీష్ మాట్లాడుతూ ధర్మవరంలో ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరగలేదని ఈరోజు ఆ లోటు తీరడం అందరికీ సంతోషదాయకమని తెలిపారు. అతి చిన్న వయసులోనే ఇటువంటి నృత్య ప్రదర్శన పోటీలు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి పిల్లలను ప్రోత్సహించాలని నిర్వాహకులకు తెలిపారు. కన్వీనర్ నటరాజ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ పోటీలు విజయవంతం కావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి కారకులైన ప్రభుత్వానికి ,నాట్య కళాకారుల, తల్లిదండ్రులకు ,పట్టణ ప్రముఖులకు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతాభి వందనాలు తెలిపారు. మున్ముందు అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు