విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కూచిపూడి కళా కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ నృత్యోత్సవపు ముగింపు వేడుకలు బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్, అడహక్కు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్, లక్ష్మి గోవింద చౌదరి, పుల్లయ్య, కలవల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందంశెట్టి జగదీష్ మాట్లాడుతూ ధర్మవరంలో ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరగలేదని ఈరోజు ఆ లోటు తీరడం అందరికీ సంతోషదాయకమని తెలిపారు. అతి చిన్న వయసులోనే ఇటువంటి నృత్య ప్రదర్శన పోటీలు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేసి పిల్లలను ప్రోత్సహించాలని నిర్వాహకులకు తెలిపారు. కన్వీనర్ నటరాజ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ పోటీలు విజయవంతం కావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి కారకులైన ప్రభుత్వానికి ,నాట్య కళాకారుల, తల్లిదండ్రులకు ,పట్టణ ప్రముఖులకు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతాభి వందనాలు తెలిపారు. మున్ముందు అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఘనంగా ముగిసిన రాయలసీమ నృత్యత్యోత్సవపు ముగింపు వేడుకలు
RELATED ARTICLES