Friday, June 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రైవేట్ విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ కల్పించాలని కలెక్టర్ కు ఏపీయూడబ్ల్యూజే వినతి

ప్రైవేట్ విద్యాసంస్థలలో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ కల్పించాలని కలెక్టర్ కు ఏపీయూడబ్ల్యూజే వినతి

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థలలో 50 శాతం రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ ఆధ్వర్యంలో యూనియన్ నేతలు కలెక్టర్ ను కలిసి వెంటనే రాయితీకి సంబంధించిన సర్కులర్ జారీ చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఏపీయూడబ్ల్యూజే వినతిపత్రంపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఇవాళ సాయంత్రానికి విద్యాశాఖ నుంచి మేము జారీ చేయాలని డీఈవో ప్రసాద్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మెమో విడుదల చేస్తామని చెప్పారు. కలెక్టర్ ని కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా జాయింట్ సెక్రెటరీ చలపతి, కమిటీ సభ్యులు ఆక్కులప్ప, భూమిరెడ్డి, చౌడప్ప, వెంకటరెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు