విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరంలోని రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మాక్ డ్రిల్ లో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ నటరాజ్, రైల్వే స్టేషన్ మాస్టర్ నరసానాయుడు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, రెవెన్యూ, జి ఆర్ పి, ఆర్పిఎఫ్ నిర్వహించారు. వీరందరూ కూడా అవగాహన కొరకు మాకు డ్రిల్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఒకవేళ పాకిస్తాన్ మన దేశంపై ప్రతి దాడి చేస్తే ఆ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రమాదాలు జరిగితే ఎలా రక్షించుకోవాలి, ప్రమాదాల బారిన పడితే వైద్యులు చేసే ప్రధమ చికిత్సలు తదితర వాటిని ఈ డ్రిల్స్లో వివరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూరాలు పార్టీ శాని పై మనవాళ్లు యుద్ధం చేసి కొందరు ఉగ్రవాదులు కూడా హతమార్చడం జరిగిందని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతోందని, ప్రజలు కూడా అవగాహన కల్పించుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి రాజు జి ఆర్ పి సి ఐ అశోక్ కుమార్, వీఆర్ఏ రవి శేఖర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మవరం రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహణ..ఆర్డీవో మహేష్
RELATED ARTICLES