Saturday, June 14, 2025
Homeజిల్లాలుఅనంతపురంసకాలములో పంట రుణాలు రెన్యూవల్ చేసి వడ్డీ రాయి తిని అందించాలి

సకాలములో పంట రుణాలు రెన్యూవల్ చేసి వడ్డీ రాయి తిని అందించాలి

నోడ్యూస్ లేకుండా వెబ్ ల్యాండ్ అధారంగా పంటఋణాలివ్వాలి
జిల్లారైతుసంఘముఅద్యక్షులు చిన్నప్ప యాదవ్
విశాలాంధ్ర- శింగనమల : ఏపిరైతుసంఘంఅద్వర్యంలో శింగనమల కెనరాబ్యాంక్ మేనేజర్ మధుసూదన్ కి మంగళవారంపలుడిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు.
ఈ సంధర్బంగా రైతుసంఘజిల్లా అద్యక్షులు చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ,
రైతులకు సాగుకోసం సేద్యపుఖర్చులు,విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు,కుటుంబ జీవన ఖర్ఛులు అధికమవుతున్నందునసరైన వర్షాలు కురవక,పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలై ఆత్మహత్యల వైపు మల్లుతున్నారని, ఒకపక్క ప్రైవేటు వ్యక్తుల దగ్గర ప్రైవేట్ ఫైనాన్సుల్లో, మరోపక్క బ్యాంకుల్లో ఋణాలు తీసుకొని సకాలంలో చెల్లించలేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు,అందువలన బ్యాంకులు సబ్సిడీ ఋణాలు పి ఎం ఈ జి బి ఋణాలు పాడిపశువులకు, గొర్రెలకు ,మేకలకు , చేనేత కార్మికులకు, చేతివృత్తులకు సబ్సీడీఋణాలు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుండిఅప్పులు తీసుకొని చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు, కనుక బ్యాంకు అధికారులు ఇప్పటికైనా స్పందించి అన్ని వర్గాల వారికి సబ్సిడీలతో ఋణాలు అందించాలన్నారు. రైతులుఇబ్బందుల వలన సకాలంలోచెల్లించ లేని ఋణాల అకౌంట్లను హోల్డ్ లో పెట్టడం ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని, ఇప్పటికైనా హోల్డ్ లో పెట్టిన ఖాతాలను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో శింగనమలరైతుసంఘంని యోజకవర్గఅద్యక్షులు మధుయాదవ్,చేనేతకార్మికసంఘం మండలకార్యదర్శి మధు,వ్యవసాయకార్మికసంఘం మండలకార్యదర్శి మునిస్వామి,నార్పలరైతుసంఘముమండలకార్యదర్శి లలితమ్మ, జయరాం నాయక్ ,కుళ్ళాయప్ప,కిష్టానాయక్,నల్లప్పతదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు