విశాలాంధ్ర -నందిగామ:-నందిగామ నియోజకవర్గ ప్రజా హృదయుడు స్వర్గీయ దేవినేని వెంకటరమణ నియోజకవర్గ ప్రజల మదిలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని డిసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖరరావు అన్నారు బుధవారం స్వర్గీయ దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతి సందర్భంగా నందిగామ 19 వార్డు హనుమంతుపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజల సమక్షంలో పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గానికి అందరూ రాజకీయ నాయకులు వచ్చి వెళ్లారు కానీ స్వర్గీయ దేవినేని వెంకటరమణ ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని అన్నారు అటువంటి నాయకుడిని కోల్పోవడం నందిగామ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమని అన్నారు ఆయన అతి తక్కువ కాలంలోనే ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ప్రజా అవసరాల మేరకు పనులు నిర్వహించారని నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో స్కీములు నిర్మించి రైతు బాంధవుడు గా నిలిచారని అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా డొంక రోడ్ల నిర్మాణం తోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గాడిపర్తి భీమయ్య,ఆవుల సాంబశివరావు,ఘంట వీరభద్రరావు,వేజెండ్ల నరసింహారావు,గంట సాంబశివరావు,గాడిపర్తి సత్యనారాయణ,మంద ఆదాము,మంద రాణి,వేల్పుల వెంకటరావు,మంద జాన్ పీటర్,మోదుపల్లి కృష్ణ తదితరులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ప్రజా హృదయనేతగా దేవినేని వెంకటరమణ…డిసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్
RELATED ARTICLES