విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం నిర్మాణం జరుగుతుంది. సందర్భంగా ఆలయ నిర్మాణమునకు పలువురు భక్తాదులు విరాళాలుస్తూ తమభక్తిని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని లోని కోట వీధికి చెందిన పి పరమేష్ 5000 రూపాయలను ఆలయ కమిటీ వారికి అందజేశారు. అనంతరం ఆలయంలో దాత పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు సంకారపు జయ శ్రీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహులు, జయ ప్రకాష్ పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుడు విరాళం
RELATED ARTICLES