విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టిటి స్పోర్ట్స్ సెంటర్లో ప్రతిరోజు మైత్రి అనే విద్యార్థిని ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా అండర్ 19 బాలికల విభాగంలో నెల్లూరులో ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు జరిగే జిల్లా క్రికెట్ టోర్నమెంటులో అనంతపురం జట్టుకు ఎంపిక కావడం జరిగిందని ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ rdt ఇస్తున్న ఈ ఉచిత క్రికెట్ కోచింగ్ ఎంతోమంది క్రీడాకాలకు ఉపయోగపడుతుందని, పేదవారై ఉండి క్రికెట్లో రాణిస్తున్నారని, క్రీడల్లో రాణించాలి అంటే డబ్బు లేకపోయినా ఆర్డిటి ఆదుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. డబ్బు లేకపోయినా క్రీడల పట్ల ఆసక్తి గల క్రీడాకారులకు ఆర్టిటి చేస్తున్న సహాయ సహకారాలు మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన మైత్రి మాట్లాడుతూ ఆర్డిటి సంస్థకు తాను రుణపడి ఉంటారని తెలుపుతూ కోచుకు ఆర్డిటికు కృతజ్ఞతలు తెలియజేసింది.
జిల్లా క్రికెట్ జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక
RELATED ARTICLES