Wednesday, April 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆంధ్రప్రదేశ్ సీనియర్ రాష్ట్ర హాకీ జట్టులో ధర్మవరం క్రీడాకారులు

ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాష్ట్ర హాకీ జట్టులో ధర్మవరం క్రీడాకారులు

విశాలాంధ్ర -ధర్మవరం : హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వతేదీ నుండి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నగరంలో జరుగనున్న 15వ పురుషుల జాతీయ సీనియర్ హాకీ పోటీలలో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం క్రీడాకారులు ప్రశాంత్,లోకేష్,ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బంధనాథం సూర్యప్రకాష్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మర్చి నెలలో గుంటూరు జరిగిన 15వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో శ్రీ సత్యసాయి జిల్లా హాకీ జట్టు రెండవ స్థానం సాధించడం జరిగిందన్నారు. అందులో ప్రతిభ కనబరిచిన ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర జట్టులో స్థానం కైవసం చేసుకోవడం జరిగిందన్నారు.
ఎంపికైన క్రీడాకారులకు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ,బంధనాతం సూర్య ప్రకాష్, హాకీ సత్యసాయి జిల్లా గౌరవాధ్యక్షులు. బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్ , హాకీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు బీ.వీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, ఉడుముల రామచంద్ర,గౌరీ ప్రసాద్ , ఊకా రాఘవేంద్ర,
మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న,జాయింట్ సెక్రెటరీ అరవింద్ గౌడ్, చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్ , అమునుద్దీన్ , కిరణ్ అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు