Thursday, June 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంమౌలిక వసతులతో కూడిన ధోబిఘాట్లను ఏర్పాటు చేయాలి

మౌలిక వసతులతో కూడిన ధోబిఘాట్లను ఏర్పాటు చేయాలి

రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. లింగమయ్య జిల్లా కలెక్టర్కు వినతులు విశాలాంధ్ర -అనంతపురం : మౌలిక వసతులతో కూడిన ధోబిఘాట్లను ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. లింగమయ్య జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కు మంగళవారం కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. లింగమయ్య రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ మాట్లాడుతూ… రజకులమైన మేము మైల బట్టలు ఉతకడానికి మాకు సరైన నీటి సౌకర్యం లేక, దోభి ఘాట్లు లేక, మాకు ఉపాధి లేక మా కుటుంబాలను, పోషించుకోలేక మా పిల్లలను, చదివించుకో లేక మా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి దుర్భర జీవితాలు,అనుభవిస్తున్నామన్నారు. దయచేసి మాకు జిల్లా పంచాయతీ రాజ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫండ్ జనరల్ ఫండ్ ,ద్వారా మాకు. 1. బుక్క రాయసముద్రం మండలం. చాకలి ఐలమ్మ కాలనీ నందు మరియు. 2.గార్లదిన్నె మండలం కల్లూరు నందు మరియు
3.పామిడి గ్రామము నందు మరియు 4. యాడికి గ్రామం నందు మరియు 5.యాడికి మండలం కుప్పాల గ్రామము నందు మరియు 6.సింగనమల్ల సోధన పల్లి గ్రామము నందు మరియు 7.పెద్దవడుగూరు నందు ఏర్పాటు చేసి మాకు ఉపాధి అవకాశములు కల్పించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక వృత్తిదారుల సమాఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు