Tuesday, February 4, 2025
Homeతెలంగాణఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు

ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు

సినీ నిర్మాత దిల్ రాజు హైదరాబాదులోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో డాక్యుమెంట్లు, బ్యాంకు పత్రాలను తీసుకుని ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు సినిమాలు రెండు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు