విశాలాంధ్ర ధర్మవరం;; పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థుల యొక్క విద్యా సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ కుమార్, జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి, టిడిపి పార్టీ నాయకుడు చింత మహేష్ ఈ సందర్భంగా కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కార్యక్రమం జరపడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ కిట్ని పాఠశాల ప్రారంభం రోజే అందించడము అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఘనత అని తెలిపారు. అదేవిధంగా తల్లికి వందనం కూడా ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు ఇస్తున్నామని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం సన్నబియ్యం ఫైన్ రైస్ ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ధర్మవరం మండలంలో పదివేల 10550 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్టిని పంపిణీ మండల వ్యాప్తంగా జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్ ,డిష్ రాజు తదితరులు పాల్గొన్నారు
పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థుల యొక్క విద్య సామాగ్రి పంపిణీ..
RELATED ARTICLES