Thursday, April 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేయుత

క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేయుత

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నివాసముంటున్న కానాల హరీష్-31 సంవత్సరాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైనాడు. సమాచారం అందుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు వ్యాధిగ్రస్తుని ఇంటికి చేరుకొని, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రూ.35,000 నగదును అందజేశారు. హరీష్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాతలు ఎవరైనా ఇంకను ఆర్థిక సహాయము సహాయము అందించాలని కోరారు. హరీష్ కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా కలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తల్లం నారాయణమూర్తి,ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కార్యదర్శి మంజునాథ్, డైరెక్టర్లు సాయి ప్రసాద్, రామకృష్ణ ,రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు