ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు నే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిందే.