Friday, June 6, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది…

ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది…

మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి

విశాలాంధ్ర- నందిగామ:-ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తూ కాదనీ,పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అన్నారు గురువారం మున్సిపల్ కౌన్సిలర్లు,కూటమి నేతలు అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ మున్సిపల్ కార్యాలయం మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ కలిసి అడవులను కాపాడుకోవడం, జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం అని తెలియజేశారు. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందనీ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది,అందుకే స్వచ్ఛ భారత్ లో భాగంగా మనం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని,చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నామని అన్నారు ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన అంశాన్ని థీమ్ గా తీసుకున్నారనీ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు