ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ ప్రముక్ కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి శరత్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ ప్రముక్ కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి శరత్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల భగవాన్ శ్రీ జిహ్వేశ్వర భజన మందిరములో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభిక వర్గ ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రారంభిక వర్గాలు స్వామి వివేకానంద, నేతాజీ, బాలగంగాధర్ తిలక్, డాక్టర్ జి, అబ్దుల్ కలాం మొదలగు మహనీయుల ఆశయ, ఆంక్షలు నిజం చేయుటకు, నేటి యువత వ్యక్తిగత జీవితమునకు, మానసిక, శారీరక శిక్షణ ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఈ శిక్షణలో వ్యాయామం, యోగాసనాలు, ఆటలు, కథలు, మొదలగు అంశాల ద్వారా శారీరక, మానసిక వికాసమునకు, దేశభక్తిని పెంపొందించుటకు జాతీయ భావాలున్న యోగ్యమైన వ్యక్తులను నిర్మాణమునకు అఖిలభారత యువజన భాగములో ఈ మూడు రోజులపాటు ఈ వర్గను ఏర్పాటు చేయడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ దేశం నాకేమీ ఇచ్చింది అన్న ఆలోచన కాకుండా, దేశమునకు నేను ఏమి చేశాను అన్న సంకల్పంతో ముందుకు రావాలని తెలిపారు. సమాజం కోసం సమయం కేటాయించి పనిచేయాలని, భారతదేశ ప్రపంచంలో విశ్వ గురువుగా నిలవడానికి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్ రామాంజనేయులు, ఖండ కార్యవాహ్ నరసింహ, ఉపాధ్యాయ ప్రముఖు అన్నం అరవింద, ఉమా మహేష్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలి..
RELATED ARTICLES