ఏఐఎస్బి నిడిమామిడి విష్ణు నారాయణ
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని దర్శనిమల గ్రామంలోని పంచాయతీ కార్యాలయం (ప్రభుత్వ పాఠశాల ఎదురుగా) నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం పట్ల ఏఐఎస్బి నాయకుడు నిడిమామిడి విష్ణు నారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యం కొరకే ఇటువంటి శిబిరాలు పలుసార్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో దర్శనమల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా 85 మంది పాల్గొని వైద్య చికిత్సలను అందుకున్నారని తెలిపారు. అనంతపురంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్యులు రోగులకు వైద్య చికిత్సలను అందించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ శిబిరంలో జి ఆర్ పి ఎస్, బిపి, ఈసీజీ, 2డి ఎకో తదితర వాటికి ఉచితంగా పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో గుండెనొప్పి, చాతి నొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్ళు తిరగడం, గుండెలో మంట కలగడం, చాతి బరువుగా ఉండడం, నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలకు వైద్యులు చక్కటి వైద్య చికిత్సలను అందిస్తూ తగిన ఆరోగ్య నియమాలు కూడా తెలపడం జరిగిందన్నారు. ఈ ఉచిత గుండె వైద్య శిబిరం వల్ల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఈ శిబిరంలో గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఉచిత గుండె వైద్య శిబిరమునకు విశేష స్పందన..
RELATED ARTICLES