పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చేతులమీదుగా జానపద కళా వైభవం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ రంగస్థలం సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దిపోగు ఆనంద్, మానస నృత్య కళాకేంద్రం గురువు ఆర్. మానసలు మాట్లాడుతూగ రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఆగస్ట్ 22 న జానపద దినోత్సవం సందర్భంగా 2025 మంది జానపద కళాకారులతో మహబృంద నృత్యం ” జానపద కళావైభవం -2025 ” అనే కార్యక్రమాన్ని పిటిసి క్రీడా మైదానమునందు అనంతపురం నందు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. అందుకు మంత్రిని కూడా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
రమేష్ – డాన్స్ మాస్టర్ చంద్ర ( చందు డాన్స్ స్టూడియో ఫౌండర్ ),కృష్ణ తులసి తదితరులు పాల్గొన్నారు.
జానపద పోస్టర్స్ విడుదల
RELATED ARTICLES