డీ ఎస్సీ అభ్యర్థులకు సువర్ణ అవకాశం
విశాలాంధ్ర-కదిరి : డీఎస్సీ పరీక్షల కొరకు ఆన్లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ,టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు అర్హత సాధించి తాలూకా పరిధిలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని వార్డెన్లు జయరామి రెడ్డి, షబాన,లీలావతి తెలిపారు. బిసి,ఈబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు డి.యస్.సి. ఆన్-లైన్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేయు వారు టెట్ పరీక్షలో అర్హత సాధించిన మార్కుల జాబితా, నేటివిటీ పత్రము,కుల, ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డుతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాదికారిత అధికారి కార్యాలయంలో ఈ నెల 15లోపు దరఖాస్తులు a అందజేయాలని తెలిపారు.ఈ అవకాశాన్ని శ్రీసత్యసాయి జిల్లా వాసులు ఉపయోగించు
కోవాలన్నారు.మరిన్ని వివరాలకు కార్యాలయములో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ,సాధికారిత అధికారిని ఎస్. నిర్మలా జ్యోతి, లేదా ఫోన్ నెంబరు 9392141545 ద్వారా సమాచారన్ని తెలుసుకోవచ్చన్నారు.