Friday, June 13, 2025
Homeజిల్లాలుఅనంతపురంలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం : ఆర్డిఓ కేశవ నాయుడు

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం : ఆర్డిఓ కేశవ నాయుడు

అనంతపురం : “లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం ” అని ఆర్డిఓ కేశవ నాయుడు పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ కేశవ నాయుడు అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం గురించి గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు మొదటిగా అవగాహన కల్పించాలని వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాలని కోరారు. అలాగే లింగ నిర్ధారణ కు పాల్పడే స్కానింగ్ సెంటర్ లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని డిఖాయి ఆపరేషన్స్ నిర్వహించి లింగ నిర్ధారణకు పాల్పడేటువంటి డాక్టర్లను మరియు చట్టాన్ని ఉల్లంఘించిన ఆసుపత్రి వారిని శిక్షించాలని ఆదేశించారు. ఇదే సమయంలో నిపుణులైన డాక్టర్ల సూచనలు ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్స్ కు సంబంధించిన మందులు అమ్మేటువంటి మందులు షాపులను గుర్తించి వాటిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమాన్ కు సూచించారు. అలాగే తనిఖీలు నిర్వహించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ సరోజన ఆసుపత్రి
డాక్టర్ పార్వతి గైనకాలజిస్ట్ మాట్లాడుతూ… అబార్షన్లకు మందులు వేసుకుని గవర్నమెంట్ ఆసు పత్రులకు చివరి నిమిషము నకు వచ్చి గర్భస్రావం అవుతున్నారు అని ఆర్డిఓ కి వివరించారు
ఎవరైతే గర్భస్రావం మాత్రలు మందుల షాపులలో తీసుకుంటారో ఆ షాపులపై ఆకస్మిక దాడులు జరపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పార్వతి గైనకాలజిస్ట్,డాక్టర్ శంకర్ నాయక్ పీడియాస్ట్రీట్, డాక్టర్ శ్రావణి పేథాలజిస్ట్, డాక్టర్ దుర్గేష్ ఆర్డిటి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హనుమన్న, డెమో త్యాగరాజు, డిప్యూటీ హెచ్ ఓ గంగాధర్ ,కే శాంతి లాల్ సిఐ, ఎన్జీవో రెడ్స్ నుంచి అనిత, డి ఐ వీఆర్వో ప్రభావతి, ఐసిడిఎస్ నుంచి సంధ్యారాణి, మానిటరింగ్ కన్సల్టెంట్ ఎం ఆషారాణి , సి వెంకటేష్ డిప్యూటీ హెచ్ ఈ ఓ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు